జాతీయంహోమ్

కేంద్ర కేబినెట్ విస్తరణ కు ముహూర్తం ఖరారు

#Modi

కేంద్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్‌లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు వీలుగా ఈనెల 15న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్ విస్తరణపై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, అధిష్టానం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్తగా మంత్రిపదవులు దక్కించుకోబోయే నేతలకు ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలందరూ అందుబాటులో ఉండాలని పార్టీ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశావహుల నిరీక్షణకు ఈ పునర్‌వ్యవస్థీకరణతో తెరపడనుంది.
ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలకు ఈసారి కేబినెట్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, రాబోయే మార్పుల్లో మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వంలో చురుగ్గా ఉంటూనే, పార్టీ బలోపేతం కోసం కొంతమంది ప్రస్తుత కేంద్రమంత్రులను మంత్రిమండలి నుంచి తప్పించి, వారికి సంస్థాగతంగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

యథావిధిగా ఈనెల 15న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుండగా, కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే వారికి కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే, ఈసారి పూర్తిస్థాయిలో కొలువుదీరనున్న కేంద్ర కేబినెట్ సరికొత్త వ్యూహాత్మక మార్పులతో ముందుకు సాగనుందని స్పష్టమవుతోంది.

Related posts

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుందో తెలుసా?

Satyam News

13 నుంచి న్యూఢిల్లీలో ఎస్‌జెఎఫ్‌ఐ జాతీయ మహాసభ

Satyam News

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News

Leave a Comment