ముఖ్యంశాలుహోమ్

IDFC First Bankలో భారీ కుంభకోణం

#IDFCFirstBank

IDFC First Bank లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.116 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం జరిగినట్లు తేలడంతో చండీగఢ్ పోలీసులు బుధవారం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నలిని మాలిక్‌ను అరెస్ట్ చేశారు.

ఈ కేసును చండీగఢ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రూ.116 కోట్ల విలువైన నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులు (FDRs) సృష్టించినట్లు వెల్లడైంది. పోలీసుల ప్రకారం, IDFC First Bank కు చెందిన బ్రాంచ్ మేనేజర్ రిభవ్ రిషి, నలిని మాలిక్, అలాగే CREST ప్రాజెక్ట్ డైరెక్టర్ సుఖ్విందర్ సింగ్‌లతో కుమ్మక్కై షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ అంశాన్ని కోర్టులో పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో రిభవ్ రిషి, అభయ్ కుమార్, సీమ ధీమన్‌లను అరెస్ట్ చేశారు. అలాగే CREST‌కు చెందిన అకౌంటెంట్ సహిల్ కుక్కర్‌తో పాటు సుఖ్విందర్ సింగ్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా రిభవ్ రిషి 2023 నుంచి 2025 వరకు చండీగఢ్ సెక్టర్-32లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసినట్లు తెలిసింది.

ఈ సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరచి, రూ.116 కోట్ల విలువైన నకిలీ FDRలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులను షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్లు, విక్రమ్ వాధ్వా సహకారంతో ఈ వ్యవహారం నడిచినట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ FDRలు బ్యాంక్ కంప్యూటర్ సిస్టమ్‌ల ద్వారా సృష్టించి, డబ్బును నలిని మాలిక్, సుఖ్విందర్ సింగ్ కుటుంబ సభ్యులు, ఇతరులకు నగదు, ఖాతాల ద్వారా మళ్లించినట్లు వెల్లడైంది. చండీగఢ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ మూసివేత సమయంలో మున్సిపల్ నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మార్చినట్లు రికార్డుల్లో చూపించారు.

అయితే వాటిని నగదు చేసుకోవడానికి అధికారులు బ్యాంక్‌ను సంప్రదించగా, ఆ FDRలు అసలు లేవని బయటపడింది. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లలో అనుమానాస్పద లావాదేవీలు బయటపడటంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అనంతరం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

సరిహద్దు గ్రామాల్ని ముంచేసిన పాక్ పాలకులు

Satyam News

ఇండిగో అయినా ఎవరైనా ఊరుకోం

Satyam News

ప్లాట్ ఫామ్ ఫీజును మళ్లీ పెంచిన స్విగ్గీ

Satyam News

తీర్పుల జాప్యం పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

Satyam News

సీఎం ప్రజావాణి లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెంచులు

Satyam News

కడపలో అర్ధరాత్రి దారుణం: ఇల్లు నేలమట్టం

Satyam News

Leave a Comment