మెదక్హోమ్

పరిశ్రమల మనుగడకు పటిష్ట నీటి నిర్వహణే కీలకం

పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ‘ది పార్క్’ హోటల్‌లో గురువారం జరిగిన “నీటి భద్రత – పారిశ్రామిక స్థిరత్వం” ఉన్నత స్థాయి సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, నీటి భద్రత లేకపోతే శాశ్వత పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రతి పారిశ్రామిక పార్కులోనూ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని, అధునాతన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత (CSR) నిధులను స్థానిక చెరువుల పునరుద్ధరణకు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతుల మెరుగుదలకు కేటాయించాలని ఆమె పిలుపునిచ్చారు.

భూగర్భ జలాలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలో పరిశ్రమలు ఐఓటీ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి స్మార్ట్ సాంకేతికతను ఉపయోగించుకుని నీటి వృధాను, లీకేజీలను అరికట్టాలని సదస్సులో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని పారిశ్రామిక నీటి నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.

Related posts

రౌడీ పెరేడ్ చేయించిన నెల్లూరు పోలీసులు

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

Satyam News

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News

‘అమరావతి’ అంటూ జమ్మలమడుగు జన గర్జన!

Satyam News

అర్థరాత్రి ఖాకీలు కుయ్యి… కుయ్యిమంటూ అలెర్ట్

Satyam News

Leave a Comment