సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలోనే ఉగ్రవాది సిరాజ్ విచారణతో విజయనగరం తో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది.ప్రస్తుతం ఈ ఏడాది లో ఇదే సమయంలో పోలీసులు హార్నలతో మరోసారి విజయనగరం ఉలిక్కి పడింది.
అయితే విజయనగర ప్రజలను అలెర్ట్ చేసేందుకు ఎస్పీ దామోదర్ అర్ధరాత్రి 12గంటల నుంచీ రెండు వరకు నగరం మొత్తం తిరిగారు. మొత్తం 200 పాయింట్లలో 1200మంది సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా పహరా కాసారు. విజయనగరం లో 600 మంది సిబ్బందితో ప్రతీ జంక్షన్ లో ఒక ఎస్ఐతో ప్రతీ రోడ్ లో ఒక్కో కానిస్టేబుల్ తో అర్థరాత్రి విధులు నిర్వహించి ప్రజలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్న భరోసా ఎస్పీ దామోదర్ ఇచ్చారు.
ఈ పహారలో డీఎస్పీ రాఘవులు, సీఐలు ఆర్వీకేచౌదరి, శ్రీనివాస్, గోపాల్ నాయు, ఎస్ఐలు సురేంద్ర నాయుడు, ప్రసన్నకుమార్, కృష్ణమూర్తి, త్రినాధ్, ప్రమీల ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
