సినిమాహోమ్

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

#PCAditya

విలక్షణ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి డా. పీసీ ఆదిత్య మరో ప్రయోగం చేశారు. గత 30 సంవత్సరాలనుండి సినీ రంగం లో పలు ప్రయోగాలు చేస్తూ ఆదిత్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రికార్డులు సాధిస్తూ గుర్తింపు పొందారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి గాయకుడు గా మారారు.

సాంకేతిక విప్లవం లో భాగం గా వచ్చిన AI ( ARTIFICIAL INTELLIGENCE ) విధానం లో నాలుగు నిముషాలు సమయం గల ప్రేమ గీతాన్ని రచించి గానం చేశారు.’ రాయే… నా లచ్చి ‘ అంటూ జానపద శైలిలో ఉత్తరాంద్ర యాస లో సాగిన ఈ గీతం టీజర్ ఇప్పటికే ప్రజాధరణ పొందింది.

నేడు 11 వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ గీతాన్ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ప్రయోగం లో కూడా ఆదిత్య విజయం సాధించారు. పలువురు అభిమానులు, మిత్రులు ఆదిత్య కు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ లో ఈ AI విధానం లో మరిన్ని ఆడియో, వీడియో గీతాలను రూపొందిస్థానని ఆదిత్య హామీ ఇచ్చారు.

Related posts

హెరిటేజ్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన బొత్స

Satyam News

జలం విలువ తెలియని జగన్ చేసిన నష్టం ఇదీ…..

Satyam News

ఫ్రాడ్ కేసులో చిక్కిన బాలివుడ్ నటులు

Satyam News

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

Satyam News

ప్రముఖ కవి అందెశ్రీ ఆకస్మిక మృతి

Satyam News

కోల్డ్ వేవ్ తో అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

Satyam News

Leave a Comment