కృష్ణహోమ్

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

#Vysya

విజయవాడలో ఈరోజు జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం)  కార్యవర్గ సమావేశం  ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్  వైష్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో  సుమారు 200 మంది కి నియామక పత్రాలు అందజేయడం జరిగింది.  ఈ నియామక పత్రాలను అంతర్జాతీయ ముఖ్య సలహాదారులు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్  వైష్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు చేతుల మీదగా అందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంస్థ అంతర్జాతీయ ఖ్యాతి గాంచినదని, జాతీయస్థాయిలో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఐ వి ఎఫ్ సంస్థను ఆంధ్రప్రదేశ్లో కూడా పేద ఆర్య వైశ్యలకు ఉపయోగ పడేలా మంచి, మంచి కార్యక్రమాలు చేసి ఆపదలో ఉన్న ఆర్యవైశ్యులకు ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా, ఐ వి ఎఫ్ సంస్థను బలోపేతం చేయవలసిందిగా నూతన కమిటీ సభ్యులను కోరారు.

Related posts

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News

మమత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Satyam News

వచ్చే నెలలో పెళ్లి… నేడు ప్రమాదం లో మృతి

Satyam News

విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

Satyam News

జల విహార్ వద్ద అట్టహాసంగా కైట్ ఫెస్టివల్

Satyam News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

Leave a Comment