విజయవాడలో ఈరోజు జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం) కార్యవర్గ సమావేశం ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో సుమారు 200 మంది కి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రాలను అంతర్జాతీయ ముఖ్య సలహాదారులు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు చేతుల మీదగా అందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంస్థ అంతర్జాతీయ ఖ్యాతి గాంచినదని, జాతీయస్థాయిలో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఐ వి ఎఫ్ సంస్థను ఆంధ్రప్రదేశ్లో కూడా పేద ఆర్య వైశ్యలకు ఉపయోగ పడేలా మంచి, మంచి కార్యక్రమాలు చేసి ఆపదలో ఉన్న ఆర్యవైశ్యులకు ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా, ఐ వి ఎఫ్ సంస్థను బలోపేతం చేయవలసిందిగా నూతన కమిటీ సభ్యులను కోరారు.
