25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రతులపై దైవానుగ్రహం ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఈ బడ్జెట్ ద్వారా మేలు జరగాలని కోరుకుంటూ మంత్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీ గౌతమ్ అల్లాడ, ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ సూరజ్ గనోర్, తదితర అధికారులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Related posts

ఎర్రకోట పేలుళ్ల ఘటనలో కీలక అరెస్టు

Satyam News

కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!

Satyam News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam News

మతం మారిన వారి ఎస్సీ రిజర్వేషన్ రద్దు

Satyam News

దర్శకుడు పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారం…

Satyam News

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి: వామపక్ష నేతలు

Satyam News

Leave a Comment