జాతీయం హోమ్

ఎర్రకోట పేలుళ్ల ఘటనలో కీలక అరెస్టు

#DelhiBlast

నవంబరు 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక అరెస్టు చేసింది. పేలుడు సంభవించే ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై హర్యానాలోని ఫరీదాబాద్‌ జిల్లా ధౌజ్‌కు చెందిన సోయబ్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన ఏడవ నిందితుడు ఇతడే.

ఎన్‌ఐఏ దర్యాప్తులో సోయబ్ ఉమర్‌కు ఆశ్రయం మాత్రమే కాక, పేలుడు జరిగే ముందు అవసరమైన రవాణా సహాయం కూడా అందించినట్లు తేలింది. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన కారులో బాంబు పేలుడు చోటుచేసుకోగా, ఆ కారును నడిపింది ఉమర్ ఉన్ నబీ. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కేసులో ఇప్పటికే ఉమర్‌కు కీలక సహాయకులైన ఆరుగురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్థానిక పోలీసులతో కలసి ఎన్‌ఐఏ విస్తృతంగా దాడులు, శోధనలు నిర్వహిస్తూ, ఈ ఘోర దాడిలో పాత్ర వహించిన మరోవారిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇంతకుముందు నవంబర్ 20న, ఈ దాడికి ప్రధానంగా ప్రమేయం ఉన్న నలుగురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

వీరిలో పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్, అనంతనాగ్‌కి చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, లక్నోకు చెందిన డాక్టర్ షాహిన్ సయీద్, షోపియాన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్ ఉన్నారు. వీరంతా ఈ దారుణ దాడికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది.

అదేవిధంగా, అంతకుముందు కార్ పేలుడులో ఉపయోగించిన వాహనం తన పేరుపై రిజిస్టర్ చేసుకున్న అమీర్ రషీద్ అలీ, ఉగ్రవాదికి సాంకేతిక సహాయం అందించిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ దానిష్‌లను కూడా ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన మొత్తం నిందితులందరూ ఎన్‌ఐఏ కస్టడీలోనే ఉన్నారు. దాడికి సంబంధించిన ప్రతి కోణాన్ని విశ్లేషిస్తూ, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు సంస్థ దర్యాప్తు వేగవంతం చేసింది.

Related posts

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News

అమరావతికి త్వరలో రాజధాని హోదా

Satyam News

అడ్వకేట్స్‌ కు జుడీషియల్‌ అకాడమి పెట్టాలి

Satyam News

Leave a Comment

error: Content is protected !!