26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రతులపై దైవానుగ్రహం ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఈ బడ్జెట్ ద్వారా మేలు జరగాలని కోరుకుంటూ మంత్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీ గౌతమ్ అల్లాడ, ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ సూరజ్ గనోర్, తదితర అధికారులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Related posts

కేరళ సీఎం అభ్యర్ధిపై ఇంకా అనిశ్చితే…

Satyam News

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

Satyam News

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

Satyam News

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

Satyam News

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News

Leave a Comment