ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రతులపై దైవానుగ్రహం ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఈ బడ్జెట్ ద్వారా మేలు జరగాలని కోరుకుంటూ మంత్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీ గౌతమ్ అల్లాడ, ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ సూరజ్ గనోర్, తదితర అధికారులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Related posts

అనంతగిరిలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

Satyam News

మంచి కంటెంట్‌తో రాబోతోన్న ‘కర’

Satyam News

సామాజిక న్యాయ ఉద్యమ నేత బీపీ మండల్ కు ఘన నివాళి

Satyam News

రాజకీయ పాఠశాల ప్రజాస్వామ్యానికి పునాది..

Satyam News

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News

Leave a Comment