గుంటూరుహోమ్

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రమైన బిందె తీర్థంతో అర్చకులు స్వామివారికి తొలి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడంతో వేడుకలు మొదలయ్యాయి.

పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ అధికారులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

కొండపైకి చేరుకుంటున్న భక్తులతో కోటప్పకొండ జనసంద్రాన్ని తలపిస్తోంది. శివనామస్మరణతో పల్నాడు ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్, పల్నాడు జిల్లా 

Related posts

చంద్రబాబు పుత్రోత్సాహం… లోకేష్‌ ఫుల్‌ ఖుషీ

Satyam News

అంతులేని కథ కు 50 ఏళ్లు

Satyam News

నిరుద్యోలను మోసం చేసిన కాంగ్రెస్

Satyam News

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

Satyam News

ఎర్రగుంట్లలో రూ.2.52 కోట్లు పట్టివేత

Satyam News

Leave a Comment