ముఖ్యంశాలుహోమ్

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఆంధ్రప్రదేశ్ విజయప్రస్థానం!

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ రాష్ట్ర ప్రభుత్వ “టెక్-ఫస్ట్” విజన్‌ను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయం మరియు ప్రజా సేవలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లను లైవ్ డెమోల ద్వారా వివరించడం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మార్చే అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ మరియు భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై చూపిన చొరవ ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిలో ఒక ప్రధాన టెక్ హబ్‌గా నిలబెట్టింది.

ఈ సదస్సు ప్రారంభానికి ముందే బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ సందర్శించి AI lO ఆంధ్రా దూకుడును ప్రశంసించడం స్టాల్‌కు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు మరియు పారిశ్రామికవేత్తల సందర్శనల ద్వారా రాష్ట్రానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చే మార్గం సుగమమైంది.

ఈ ప్రయత్నాలు కేవలం సాంకేతిక పురోగతికే కాకుండా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టికి మరియు ఆర్థిక వృద్ధికి బలమైన పునాది వేస్తోంది.

Related posts

పాక్ తో క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్

Satyam News

గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….

Satyam News

అన్యాయమైన డిమాండ్లు లేకపోతే చర్చలకు మళ్లీ సిద్ధం

Satyam News

పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు

Satyam News

సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Satyam News

IOC నాయకుడు హర్భజన్ సింగ్ మృతి పట్ల సంతాపం

Satyam News

Leave a Comment