ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-A మ్యాచ్లో నెదర్లాండ్స్పై® భారత్ 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ వరుస విజయాలను నమోదు చేసి, అజేయంగా సూపర్-8 దశకు చేరుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభంలోనే డకౌట్గా వెనుతిరిగినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా శివం దూబే కేవలం 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (30), తిలక్ వర్మ (28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లు గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడు కీలక వికెట్లు తీసి వారిని దెబ్బతీశారు. బ్యాటింగ్లో రాణించిన శివం దూబే బౌలింగ్లోనూ రెండు వికెట్లు పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నారు.
జస్ ప్రీత్ బుమ్రా కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. గ్రూప్-A టేబుల్ టాపర్గా నిలిచిన భారత్, తన తదుపరి సూపర్-8 పోరులో ఈ ఆదివారం (ఫిబ్రవరి 22) దక్షిణాఫ్రికాతో తలపడనుంది
.
