ప్రత్యేకంహోమ్

డయాబెటిస్ కు చికిత్స కనిపెట్టిన చైనా

#bloodsugar

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పీడిస్తున్న చక్కెర వ్యాధి (డయాబెటిస్) చికిత్సలో చైనా శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక విజయాన్ని సాధించారు. స్టెమ్ సెల్ (కణజాల) చికిత్స ద్వారా ఒక రోగిలో ఉన్న టైప్-2 చక్కెర వ్యాధిని పూర్తిగా నయం చేసినట్లు షాంఘైకి చెందిన పరిశోధక బృందం ప్రకటించింది.

వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుత ఘట్టంగా భావిస్తున్నారు. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు జీవితాంతం మందులు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త చికిత్స విధానం వల్ల సదరు రోగి గత కొంత కాలంగా ఎటువంటి ఇన్సులిన్ అవసరం లేకుండానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ చికిత్సలో భాగంగా రోగి సొంత రక్త కణాల నుంచి స్టెమ్ సెల్స్‌ను సేకరించి, వాటిని ప్రయోగశాలలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ‘ఐలెట్’ కణాలుగా మార్చారు. అనంతరం ఈ కణాలను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. ఫలితంగా రోగి శరీరంలో సహజంగానే ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ప్రారంభమైంది.

దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో డయాబెటిస్ బాధితులకు ఇన్సులిన్ సూదుల నుంచి విముక్తి లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో టైప్-1 డయాబెటిస్ రోగులకు కూడా ఈ విధానం వరంగా మారుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Related posts

గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు

Satyam News

ఆ క్షణం చనిపోవాలనుకున్నా: నటి హేమ

Satyam News

నెదర్లాండ్స్ ను ఓడించి సూపర్ 8 కు భారత్

Satyam News

భారత్ నుంచి గల్ఫ్ వెళ్లే విమానాలు రద్దు

Satyam News

Lokesh Magic: కార్పొరేట్‌ను తలదన్నే ప్రభుత్వ స్కూల్స్!

Satyam News

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

Satyam News

Leave a Comment