హైదరాబాద్హోమ్

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

#crime

శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు అమీర్‌ను ముందే హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టారా, లేక సజీవ దహనం చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

కాంగ్రెస్ వేధింపులతో బిజెపి నాయకుడు ఆత్మహత్య

Satyam News

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News

మనసు దోచుకున్న మహిళా క్రికెటర్లు

Satyam News

అమ్మా…. నాకు ఆ అబ్బాయి కావాలి!

Satyam News

యోగనారాయణ రూపంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

Satyam News

‘సకల శాఖల సజ్జల’ పై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి…

Satyam News

Leave a Comment