హైదరాబాద్హోమ్

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

#crime

శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు అమీర్‌ను ముందే హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టారా, లేక సజీవ దహనం చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

అక్కను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్న బావ హత్య

Satyam News

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

అమరావతిలో హైటెక్‌ ఫిల్మ్‌ సిటీ….!!

Satyam News

సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Satyam News

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Satyam News

Leave a Comment