హైదరాబాద్హోమ్

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

#crime

శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు అమీర్‌ను ముందే హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టారా, లేక సజీవ దహనం చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన నగర క్రీడాకారులు

Satyam News

కాలువల మరమ్మత్తు కోసం 397 కోట్లు విడుదల

Satyam News

ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..లోకేష్ 3S ఫార్ములా అదిరింది!

Satyam News

రామాలయ నిధులు కొట్టేసింది విశ్వ హిందూ పరిషత్?

Satyam News

ముచ్చింతల్‌లో సమతా మూర్తిని దర్శించుకున్న సుమ

Satyam News

డొనాల్డ్ ట్రంప్ కు భంగపాటు

Satyam News

Leave a Comment