26.3 C
Hyderabad
September 19, 2026
ఖమ్మంహోమ్

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

ఖమ్మం నగర శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలగుమట్ల వినోబా నగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపై అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులను మోహరించి ఉదయం నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. భారీ యంత్రాలతో ఇళ్లు కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

“రేవంతన్న, శీనన్న అని ఓటు వేసినందుకు ఇదే శాస్తినా?” అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, ఒక్కసారిగా ఖాళీ చేయమంటే తమ బ్రతుకు ఏంటని ప్రశ్నించారు. నిర్వాసిత కాలనీ యువకులు కర్రలతో పోలీసులను ప్రతిఘటించేందుకు సిద్ధపడగా, ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కవరేజ్‌కు వెళ్తున్న మీడియా ప్రతినిధులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నట్లు సమాచారం. “మీడియాకు అనుమతి లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి” అని కొందరు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Related posts

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని: మేఘన

Satyam News

Leave a Comment