ఖమ్మంహోమ్

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

ఖమ్మం నగర శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలగుమట్ల వినోబా నగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపై అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులను మోహరించి ఉదయం నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. భారీ యంత్రాలతో ఇళ్లు కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

“రేవంతన్న, శీనన్న అని ఓటు వేసినందుకు ఇదే శాస్తినా?” అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, ఒక్కసారిగా ఖాళీ చేయమంటే తమ బ్రతుకు ఏంటని ప్రశ్నించారు. నిర్వాసిత కాలనీ యువకులు కర్రలతో పోలీసులను ప్రతిఘటించేందుకు సిద్ధపడగా, ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కవరేజ్‌కు వెళ్తున్న మీడియా ప్రతినిధులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నట్లు సమాచారం. “మీడియాకు అనుమతి లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి” అని కొందరు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Related posts

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

Satyam News

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో…

Satyam News

‘తలసేమియా వ్యాధిపై’ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Satyam News

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News

కిలేడీ అరెస్టు: నాటకాలు షురూ

Satyam News

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

Leave a Comment