చిత్తూరుహోమ్

తిరుమలలో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

#FoodSeftey

భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని హోటళ్లులో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, తినుబండారాల దుకాణాల నుంచి ఆహార నమూనాలను సేకరించారు.

వాటిని నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని హోటల్స్ లలో శాంపుల్స్ కలెక్ట్ చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. శాంపుల్స్ పరిశీలనకు పంపామమని… ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే కచ్చితంగా ఆ హోటల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

Related posts

స‌మ‌స్య ఎవ‌రు చెప్పినా ప‌రిష్క‌రించ‌డ‌మే ప్ర‌ధానం

Satyam News

మీడియాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

Satyam News

సాక్షికి పోటీగా రూ. 500 కోట్లతో విజయసాయి రెడ్డి మీడియా!

Satyam News

రేవంత్ సర్కార్ పై బీజేపీ చార్జిషీట్

Satyam News

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు

Satyam News

సింగపూర్ ‘ట్రీ లేడీ’ ఆకస్మిక మరణం

Satyam News

Leave a Comment