మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన లెక్చలర్ దేవరాజుకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యా, పదవ తరగతి వరకు అయిజలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఆయన ఇంటర్, డిగ్రీ గద్వాల జిల్లాలోని ఓ ప్రవేటు కళాశాలలో పూర్తి చేశాడు.
పాలమూరు యూనివర్సిటీలో పీజీ చేసిన ఆయన కోల్లపూర్ పీజీ కళాశాలలో లెక్చలర్ ఉద్యోగం చేస్తునే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ రోగి సంతృప్తి అనే అంశంపై డాక్టర్ హన్నా ఆనంద్ రాజ్ గైడ్ తో పరిశోధన చేశారు.
పరిశోధన పత్రాలు పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు సంతృప్తిని వ్యక్తం చేసి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కిష్టన్న, దివేనమ్మలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలువురు అభినందనలు తెలిపారు. తోటి సిబ్బంది, విద్యార్థి బృందం పైతం సంతోషం వ్యక్తం చేశారు.
