ముఖ్యంశాలుహోమ్

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మంగళవారం గుంటూరులో సమావేశమయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రస్తుత స్థితిగతుల గురించి వివరంగా చర్చించారు.

రాబోయే రోజుల్లో నరసరావుపేట నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఎంపీని కోరారు. నరసరావుపేటలో బీసీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలం కేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే ఆటోనగర్ నిర్మాణ పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో నరసరావుపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబును అభినందించారు.

నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఇరువురు నాయకులు ఆకాంక్షించారు.

Related posts

విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసం

Satyam News

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

Satyam News

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News

ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..లోకేష్ 3S ఫార్ములా అదిరింది!

Satyam News

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన డీజీపీ

Satyam News

Leave a Comment