ముఖ్యంశాలుహోమ్

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మంగళవారం గుంటూరులో సమావేశమయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రస్తుత స్థితిగతుల గురించి వివరంగా చర్చించారు.

రాబోయే రోజుల్లో నరసరావుపేట నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఎంపీని కోరారు. నరసరావుపేటలో బీసీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలం కేటాయించే విషయంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే ఆటోనగర్ నిర్మాణ పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో నరసరావుపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబును అభినందించారు.

నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఇరువురు నాయకులు ఆకాంక్షించారు.

Related posts

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

కార్తీకమాస ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Satyam News

గీతా కృష్ణపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Satyam News

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్లకు షాక్..నాన్ బెయిలబుల్ వారెంట్‌!

Satyam News

జగన్ ని హిందువుగా మార్చగలవా భూమన….???

Satyam News

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News

Leave a Comment