రంగారెడ్డిహోమ్

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

డీజిల్ పోసుకొని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు కోసం నగరానికి వలసకు వచ్చిన ఒక కుటుంబం బడంపేట్ లోని న్యూ మారుతి నగర్ లో గత రెండు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు.

కుమార్తె కీర్తి(21) గండిపేట లోని ఎంజిఐటి కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. ఎప్పటి లాగానే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న డీజిల్ ను పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts

ది ట్రాన్స్‌పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?

Satyam News

ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా

Satyam News

67.47 లక్షల మందికి లబ్ధి…. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌!

Satyam News

బైక్ పై ముందు ఎస్పి… వెనుక మంత్రి

Satyam News

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

Satyam News

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

Satyam News

Leave a Comment