26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

డీజిల్ పోసుకొని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు కోసం నగరానికి వలసకు వచ్చిన ఒక కుటుంబం బడంపేట్ లోని న్యూ మారుతి నగర్ లో గత రెండు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు.

కుమార్తె కీర్తి(21) గండిపేట లోని ఎంజిఐటి కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. ఎప్పటి లాగానే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న డీజిల్ ను పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts

పోలవరం ఎమ్మెల్యేపై దాడి: పరిస్థితి ఉద్రిక్తం

Satyam News

పల్నాడు రైల్వే సమస్యలపై కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ భేటీ

Satyam News

మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం

Satyam News

సోషల్ మీడియాలో ‘అన్‌ఫాలో’ కలకలం

Satyam News

జాన్వీ కపూర్ కొత్త సినిమా పరం సుందరి ఈ శుక్రవారం విడుదల

Satyam News

హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా

Satyam News

Leave a Comment