మానవతా వాది కళా పోషకులు చదలవాడ శ్రీనివాసరావును ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ అఫ్ డైరక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి శ్రీనివాసరావుని కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియచేసింది.
అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి చదలవాడ శ్రీనివాస్ రావుకు పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేసారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని, పరిశ్రమలో చిన్నా పెద్ద భేదం లేకుండా అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ పాలక మండలి సభ్యులు బాల రెడ్ది, యం గిరిధర్, చదలవాడ భరద్వాజ, అప్పాజీ, పర్వీన్ బాబీ నవీన్ తదితరులు శ్రీనివాస్ రావుకు అభినందనలు తెలిపారు.
