26.3 C
Hyderabad
September 19, 2026
పశ్చిమగోదావరిహోమ్

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

#crime

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామం లో దళిత మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి శుక్రవారం చోటు చేసుకుంది.

ఎర్ర వీర రాఘవమ్మ వాళ్ల బావగారైన ఎర్ర సత్యనారాయణ, పొలంలో మేకలు మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన కలవల శ్రీధర్ రెడ్డి మేకలు తన పొలం లో పంటను తిన్నాయనే అనుమానం తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కులాన్ని కించపరిచే విధంగా దూషించి మహిళ అనే కనికరం కూడా లేకుండా గొంతు నులిమి, పారతో దాడి చేసి రక్త గాయ మయ్యేలా చేశాడు.

తనను తీవ్రంగా గాయపర్చాడని వీర రాఘవమ్మ కన్నీటి పర్యంతమై తన బంధువులకు గ్రామస్తులకు వివరించింది. గ్రామస్తుల సలహా మేరకు ఆమె బంధువులు వీర రాఘవమ్మను అదే రోజు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్సపొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

యువ నాయకత్వానికి తగిన వేదిక స్థానిక ఎన్నికలు

Satyam News

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ

Satyam News

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

యుద్ధం నేపథ్యంలో TGWWC ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం

Satyam News

మంత్రి లోకేష్ సమర్థతకు దక్కిన గుర్తింపు

Satyam News

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు

Satyam News

Leave a Comment