శ్రీకాకుళంహోమ్

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ

#Srikakulam

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు సాగిన ర్యాలీని శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సీహెచ్. వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు.

పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గంజాయి, మత్తు మాత్రలు తదితర మాదక పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఆయన, అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే ఈగల్–1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్. రామచంద్ర కుమార్, సీఐలు ఈశ్వరరావు, రామారావు, పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News

వనపర్తిలో ఎసిబి కార్యాలయం ఏర్పాటు చేయాలి

Satyam News

మృదంగ విద్వాంసుడు ‘ఎల్లా’ సంగీత లోకానికి గర్వకారణం

Satyam News

పెళ్ళిళ్ళ సీజన్ లో పసిడి ప్రేమికులకు భారీ ఊరట

Satyam News

కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

Satyam News

వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చిన మల్లయ్య

Satyam News

Leave a Comment