విజయనగరంహోమ్

ప్రధాని మోడీ అవతార పురుషుడు

#Pragnanada

ప్రపంచ దేశాలన్నీ జూన్ 21 యోగా జరపడానికి కారణం ప్రధాని మోడీ అని, మోడి అవతార పురుషుడని శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి, శ్రీ స్వామి అంతర్ముఖానంద( డా.శ్రీగురూజీ) అన్నారు. విజయనగరం జిల్లా కామన్నవలస ఆశ్రమంలో  అపర వాల్మీకి జగద్గురు శ్రీ స్వామి శివానంద పరమ హంసల వారి జయంతి సందర్బంగా శ్రీ గురూజీ అన్నారు.

యోగ అంటే ఆసనాలతో పాటు ఉచ్ఛాస, నిశ్వాసలను రాపిడి చేయడమే యోగమని అదే ప్రాణాయామం అని శ్రీగరూజీ అన్నారు. నేడు ప్రపంచం యావత్తు ఆధ్యాత్మిక చింతనలో పయనిస్తోందని అందుకు ప్రధాని మోడీ జూన్ 21  ప్రవేశ పెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణమన్నారు.

ప్రతీ ఒక్కరూ యాంత్రిక జీవనంలో పడి శ్వాసను నిర్వీర్యం చేసుకుంటున్నారని, ఈ యోగా దినోత్సవం సందర్బంగా ప్రాణాయామం విద్యను పొంది నిరంతరం సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్య వంతులు అవుతారని శ్రీగురూజీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శివ, మోహన్ రావు, శోభ, సూర్యనారాయణ, ఘాన్సీ, డా. సుబ్రహ్మణ్యం, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, డా. హరగోపాల్ లతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, అనంతపురం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచీ అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు.

Related posts

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News

గ్రోత్ రేట్ లో దూసుకుపోతున్న తెలంగాణ

Satyam News

అసెంబ్లీ కి వెళ్లనున్న సినీ హీరోయిన్ త్రిష?

Satyam News

హిల్ట్ పాలసీ పై ఇచ్చిన జి.ఓ రద్దు చేయాలి

Satyam News

ఓటరు జాబితా సవరణకు సుప్రీంకోర్టు సపోర్టు

Satyam News

నిన్న కమ్మ ద్వేషం… నేడు.. కాపులతో పాలిటిక్స్..

Satyam News

Leave a Comment