ముఖ్యంశాలుహోమ్

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరోసారి చుట్టుముట్టింది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా గాలి నాణ్యత సూచీ (AQI) క్షీణించడంతో, ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ (CAQM) ఈ సీజన్‌లో తొలిసారిగా ఆంక్షలు విధించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-1’ (GRAP-1) నిబంధనలను తక్షణమే అమలులోకి తెచ్చారు. మంగళవారం నాటికి ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 211గా నమోదైంది. ఇది ‘పూర్‌’ (Poor) కేటగిరీ కిందకు వస్తుంది. రానున్న రోజుల్లో కూడా కాలుష్యం ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేయడంతో అధికారులు ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

వాయు నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు వీలుగా, GRAP-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులు సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Related posts

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

సినీ నటి జయవాహిని కన్నుమూత

Satyam News

తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం

Satyam News

కనుల పండువగా శ్రీ అమర లింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

మిడిల్‌ ఈస్ట్ సంక్షోభం….. ఏపీకి గల్ఫ్ డేటా సెంటర్లు

Satyam News

Leave a Comment