ముఖ్యంశాలుహోమ్

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌..!

మహబూబ్‌నగర్‌లోని పాల‌మూరు యూనివ‌ర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్ట‌ల్ గ‌దిలో ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటనతో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు, వర్సిటీ వర్గాల కథనం ప్రకారం.. మృతి చెందిన కార్తీక్ పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును కాలేజీలో సబ్మిట్ చేయటానికి అతడు యూనివర్సిటీకి వచ్చాడు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అంతలోనే హాస్టల్ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కార్తీక్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related posts

కాకినాడలో స్పేస్‌ స్టేషన్‌…. హోప్‌ ఐలాండ్‌ నుంచి రాకెట్లు..!!

Satyam News

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News

రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం కొత్త కమిటీ

Satyam News

వామ్మో జగన్‌… ఆ సర్వేలో సంచలన నిజాలు…!!

Satyam News

ఈ నెల 14 లోగా డిజిటిలైజేష‌న్  ప్ర‌క్రియ‌ను పూర్తి

Satyam News

నేషనల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ వాటర్ పోలో జట్టు

Satyam News

Leave a Comment