26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌..!

మహబూబ్‌నగర్‌లోని పాల‌మూరు యూనివ‌ర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్ట‌ల్ గ‌దిలో ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటనతో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు, వర్సిటీ వర్గాల కథనం ప్రకారం.. మృతి చెందిన కార్తీక్ పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును కాలేజీలో సబ్మిట్ చేయటానికి అతడు యూనివర్సిటీకి వచ్చాడు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అంతలోనే హాస్టల్ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కార్తీక్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related posts

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

Satyam News

ప్రతి రోజూ సూర్యరశ్మి సోకితే…….

Satyam News

పెళ్లైన 38 రోజులకే భర్తను చంపిన భార్య

Satyam News

కలెక్టర్ హిమాన్షు చర్యలతో మత్స్యకారుల్లో విశ్వాసం

Satyam News

Leave a Comment