గుంటూరుహోమ్

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

#chandra

అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని ప్రభుత్వం పేర్కొన్నది. రిటర్నబుల్ ప్లాట్ ల పత్రాలపై అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని ప్రభుత్వానికి రైతులు తెలిపారు. అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో అసైన్డ్ అనే పదం తీసివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాంతో ఈ మేరకు ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  జీవో జారీ చేసింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 187 ను విడుదల చేశారు.

Related posts

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

ఉప్పలపాడులో 12న 18 దేవతా విగ్రహమూర్తుల ప్రతిష్ట 

Satyam News

క్యూలైన్లలో భక్తులు  సంయమనం పాటించాలి

Satyam News

సూపర్ స్మార్ట్ సిటీ గా నల్గొండ

Satyam News

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

Satyam News

Leave a Comment