విశాఖపట్నంహోమ్

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఘటన చివరకు ఒక భారీ డ్రామాగా తేలింది. కడపకు చెందిన పాస్టర్ అభినయ్‌పై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, వార్తలు అన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం చిత్రీకరించినవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కుట్రను అల్లూరి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన లోతైన దర్యాప్తు ద్వారా ఛేదించారు.

వివరాల్లోకి వెళ్తే, పాస్టర్ అభినయ్ దర్శన్ తన ఆరుగురు అనుచరులతో కలిసి ఈ నాటకానికి తెరలేపారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడమే లక్ష్యంగా, ఒక పథకం ప్రకారం ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలి అనే అంశాలపై వీరు ముందుగానే చర్చించుకున్నారు. ఈ కుట్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఒక నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులకు చిక్కాయి. నిందితుల మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ ఆడియో సందేశాలు, వీడియో కాల్స్, వైద్య నివేదికలను పరిశీలించిన పోలీసులు, ఇది ఆత్మరక్షణ కోసం లేదా సానుభూతి కోసం ఆడిన నాటకమని స్పష్టం చేశారు.

కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారంటూ పాస్టర్ సృష్టించిన దృశ్యాలు పూర్తిగా కల్పితమని దర్యాప్తులో తేలింది. ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. సమాజంలో అశాంతిని కలిగించేలా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. మంగళవారం రాత్రి విశాఖపట్నంలో పాస్టర్ అభినయ్ దర్శన్‌తో పాటు అతనికి సహకరించిన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం వారిని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Related posts

మదర్సా విద్యార్థులకు, మహిళలకు నూతన వస్త్రాల అందజేత

Satyam News

21 నుంచి శ్రీ ఆదిశంకరాచార్యుల రథయాత్ర ప్రారంభం

Satyam News

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Satyam News

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News

సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Satyam News

Leave a Comment