హైదరాబాద్హోమ్

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

#crime

కవాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం నాలుగో అంతస్తులో మహిళపై నిందితుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గురైన మహిళను శ్వేతగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ఎవరు, హత్యకు గల కారణాలేమిటి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్

Satyam News

దూసుకువస్తున్న “డిట్వా” తుఫాను

Satyam News

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శం

Satyam News

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News

క్యాన్సర్ తో బాధపడుతున్న బాలలకు చిత్రలేఖనం పోటీలు

Satyam News

పెట్రోల్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు

Satyam News

Leave a Comment