హైదరాబాద్హోమ్

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

#crime

కవాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం నాలుగో అంతస్తులో మహిళపై నిందితుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గురైన మహిళను శ్వేతగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ఎవరు, హత్యకు గల కారణాలేమిటి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

విజయ్ కి మళ్లీ బ్రేక్ వేసిన గవర్నర్

Satyam News

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధపడుతున్న పాక్

Satyam News

Leave a Comment