ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేసింది. చాలా ప్రదేశాలలో ‘బ్లడ్మూన్’ కనిపించింది. గ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది. దీన్ని బ్లడ్ మూన్ అంటారు. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, కాలిఫోర్నియా సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాలతో పాటు ఇండియాలో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

