హైదరాబాద్ పాతనగరం గౌలిపురాలోని సరస్వతీ అకాడమీ హైస్కూల్ లో ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు బోనాల పండుగ సంబరాలలో పాల్గొని ఆషాఢ మాసం బోనాలను అమ్మవారికి సమర్పించి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. శ్రీశ్రీశ్రీ మహాంకాళీ మాతేశ్వరి భారతమాత దేవాలయానికి సరస్వతీ అకాడమీ హైస్కూల్ కమిటీ సభ్యులు సెక్రటరీ దుర్గేశ్ లింగం, ప్రకాశ్ రాజం, జానకిరామ్, ప్రధానోపాధ్యాయురాలు దీప్తిశ్రీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో కలిసి బోనాలు ఎత్తి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో ముఖ్యపాత్ర వహించి వేణు, భువన్ పోతరాజుల వేషాలు ధరించారు. ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు ఎరమని కైలాస్ స్వాగతం పలికి సరస్వతీ అకాడమీ పాఠశాల సెక్రటరీ దుర్గేశ్ లింగం గౌడ్ ని ప్రధానోపాధ్యాయిని దీప్తిని ఘనంగా సత్కరించారు.
previous post