అనంతపురంహోమ్

భగవాన్ సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోడీ

#Modi

భగవాన్ సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నేడు పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు.

అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.

Related posts

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

Satyam News

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

Satyam News

ఎల్-నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక

Satyam News

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

Satyam News

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News

Leave a Comment