26.3 C
Hyderabad
September 19, 2026
మెదక్హోమ్

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుప్రీంకోర్టుకు….?

#HarishRao

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.

ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారు.

ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో   చర్చించనున్నారు.

Related posts

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

Satyam News

ఈ గెలుపు నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది

Satyam News

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు!

Satyam News

Leave a Comment