శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

#Srikakulam

శ్రీకాకుళం నగరంలోని టిపిఎంహెచ్ పాఠశాలలో సోమవారం జేమ్స్ ఆస్పత్రి సహకారంతో టిడిపి నాయకులు కృప సాగరం నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి మహిళా నాయకురాలు గొండు స్వాతి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం స్వాతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయాలని సూచించారు.

31వ డివిజన్ ఇంచార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సూరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇందిరమణి, బిజెపి నాయకులు సురేష్ సింగ్, వైద్యులు సోమేశు, టిడిపి కార్యకర్తలు రాము, పాపారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తారక రామారావు, శ్రీధర్, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

Satyam News

ప్రాణాలు కాపాడిన 2టౌన్ పోలీసులు

Satyam News

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

Satyam News

ఏపీలో ప్రకృతి బజార్‌లు…. ఆర్గానిక్‌ పంటలతో వంటలు

Satyam News

దేశం లో ఏకాకి అయిన వైసీపీ

Satyam News

Leave a Comment