26.3 C
Hyderabad
September 19, 2026
శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

#Srikakulam

శ్రీకాకుళం నగరంలోని టిపిఎంహెచ్ పాఠశాలలో సోమవారం జేమ్స్ ఆస్పత్రి సహకారంతో టిడిపి నాయకులు కృప సాగరం నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి మహిళా నాయకురాలు గొండు స్వాతి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం స్వాతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయాలని సూచించారు.

31వ డివిజన్ ఇంచార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సూరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇందిరమణి, బిజెపి నాయకులు సురేష్ సింగ్, వైద్యులు సోమేశు, టిడిపి కార్యకర్తలు రాము, పాపారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తారక రామారావు, శ్రీధర్, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

సర్వేల్లో వైసీపీ గ్రాఫ్‌ డౌన్‌…. ఆయనే మెయిన్‌ విలన్‌..??

Satyam News

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Satyam News

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

Satyam News

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News

రైతులపై కపట ప్రేమ ఆపి డీజిల్ రేట్లు తగ్గించండి

Satyam News

Leave a Comment