శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

#Srikakulam

శ్రీకాకుళం నగరంలోని టిపిఎంహెచ్ పాఠశాలలో సోమవారం జేమ్స్ ఆస్పత్రి సహకారంతో టిడిపి నాయకులు కృప సాగరం నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి మహిళా నాయకురాలు గొండు స్వాతి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం స్వాతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయాలని సూచించారు.

31వ డివిజన్ ఇంచార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సూరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇందిరమణి, బిజెపి నాయకులు సురేష్ సింగ్, వైద్యులు సోమేశు, టిడిపి కార్యకర్తలు రాము, పాపారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తారక రామారావు, శ్రీధర్, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News

ఇస్తాంబుల్ లో ఇజ్రాయెల్ కాన్సులేట్ పై దాడి

Satyam News

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ

Satyam News

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News

చెప్పులు ధరించి శ్రీవారి ఫోటో…. బొత్స ప్లాన్‌ బూమరాంగ్‌… వైసీపీ సెల్ఫ్‌ గోల్….!!

Satyam News

Leave a Comment