26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసు పై చంద్రబాబు సీరియస్

#ChandrababuNaidu

ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్‌ డ్రగ్స్ కేసు ఆరోపణల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ, నైతిక విలువల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ పేరు వినిపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, తక్షణమే ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై ఎంపీ నుంచి రాతపూర్వక వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వంటి సామాజిక విద్రోహ చర్యల్లో ఎవరున్నా, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యక్తులు లేదా నేతలు చేసే వ్యక్తిగత తప్పుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితిని తాను రానివ్వనని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చే ఏ కార్యకలాపాన్నైనా కఠినంగా అణిచివేస్తామని ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి సంకేతాలిచ్చారు.

ఎంపీపై అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related posts

ప్రముఖ కవి అందెశ్రీ ఆకస్మిక మృతి

Satyam News

ఉపాధి అవకాశాలు కల్పించడమే రేవంత్ రెడ్డి ధ్యేయం

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

ఇదీ రాజకీయమేనా? ఇలా ఎంతకాలం? 

Satyam News

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News

సాగునీటి సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

Satyam News

Leave a Comment