గుంటూరుహోమ్

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధులలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలవారికి పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వహించే పనులు, వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని పోలీసు అధికారులు తెలియజేశారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా పోలీస్ వారి సూచనలను బేఖాతరు చెస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలు దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరైనా గొడవలు, లేదా నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Related posts

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

Satyam News

వనపర్తి మున్సిపల్ చైర్మన్ సీటులో పోటీ

Satyam News

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

Satyam News

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు

Satyam News

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News

Leave a Comment