గుంటూరుహోమ్

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధులలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలవారికి పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వహించే పనులు, వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని పోలీసు అధికారులు తెలియజేశారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా పోలీస్ వారి సూచనలను బేఖాతరు చెస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలు దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరైనా గొడవలు, లేదా నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Related posts

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

Satyam News

అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

వేడుకగా లక్ష్మీ నరసింహ పుష్పయాగం

Satyam News

Leave a Comment