26.3 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

జీగ్రూప్ సుభాష్ చంద్ర అప్పు వివాదం ఏంటి?      

#SubhashChandra

ఒక సామాన్యుడు బైక్ లోన్ లేదా ఇంటర్నెట్ బిల్లు, కనీసం ఒక్క నెల ఈఎంఐ (EMI) ఆలస్యంగా కట్టినా ఫోన్ కాల్స్, బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఒత్తిళ్లు, సిబిల్ స్కోర్ పతనం, ఆస్తుల జప్తు నోటీసులు వెంటనే వస్తాయి. కానీ అదే వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన బడా కార్పొరేట్ దిగ్గజాల విషయానికి వస్తే మాత్రం వ్యవస్థ చూపే ఉదారత చూస్తే ఎవరికైనా విస్మయం కలగక మానదు.

తాజాగా జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

అసలు ఏం జరిగింది?

అంగీకరించిన మొత్తం అప్పులు (Claims): సుమారు రూ. 22,006 కోట్లు.

ఆమోదించిన రీపేమెంట్ ప్లాన్: కేవలం రూ. 6.5 కోట్లు.

బ్యాంకులకు తిరిగి వచ్చిన రికవరీ శాతం: దాదాపు 0.03% మాత్రమే.

హెయిర్‌కట్ (రద్దు అయిన మొత్తం): ఏకంగా 99.97%.

వంద రూపాయల అప్పు ఉంటే, కనీసం 3 పైసలు కూడా రాని పరిస్థితి ఇది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు తమకు రావాల్సిన రూ. 1,322 కోట్లకు గాను కేవలం రూ. 38 లక్షలు మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా, మెజారిటీ ఓటింగ్ (80.81%) ఈ ప్లాన్‌కు మద్దతు ఇవ్వడంతో NCLT దీనిని చట్టబద్ధంగా ఆమోదించింది. “ఇది ఆమోదించకపోతే వ్యక్తిగత ఆస్తుల విలువ ఇంకా తక్కువగా ఉంది కాబట్టి బ్యాంక్‌రప్టసీలోకి వెళ్తే ఇంత కూడా రాదు” అనేది ఇచ్చిన వివరణ.

సామాన్యుడి ప్రశ్నలు ఇవే:

అప్పు ఇచ్చేటప్పుడు నియమాలు ఏమయ్యాయి? వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు చూసిన షూరిటీలు, కొలేటరల్ ఆస్తుల విలువలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? వ్యవస్థ ఎవరికి అనుకూలం? రూ. 2 లక్షల వ్యవసాయ రుణం లేదా వ్యాపార రుణం చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే రైతులు, చిరువ్యాపారులకు లేని “ఇన్సాల్వెన్సీ రాయితీలు”, వేల కోట్లు తీసుకున్న వారికి మాత్రమే చట్టబద్ధంగా ఎలా వర్తిస్తాయి?

ప్రజాధనానికి బాధ్యులెవరు? బ్యాంకులు భరించే ఈ 99.97% నష్టం చివరికి సామాన్య పౌరుల డిపాజిట్లు, ప్రభుత్వ ఖజానా మీద పడే భారం కాదా? చట్టపరంగా మెజారిటీ ఓటింగ్, ఎన్‌సిఎల్‌టి నిబంధనలు అన్నీ సరైనవే కావచ్చు. కానీ చట్టబద్ధంగా ఉన్న ప్రతి నిర్ణయం నైతికంగా సరైనది కానక్కర్లేదు. పెద్ద కంపెనీలకు ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయం అన్న భావన బలపడితే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు.

ఈ ప్రశ్న ఒక వ్యక్తి మీదో, కోర్టుల మీదో వేస్తున్న నింద కాదు… వ్యవస్థలోని డొల్లతనాన్ని ప్రశ్నించే సామాన్యుడి గొంతుక.

Related posts

హెరిటేజ్‌పై కుట్ర…. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌…!!

Satyam News

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

Satyam News

జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

లక్ష్యం సాధించే వరకు దాడులు ఆగవు

Satyam News

Leave a Comment