హైదరాబాద్హోమ్

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైక్లాథాన్‌ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైజింగ్ తెలంగాణ” నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలనే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైక్లాథాన్‌లో దాదాపు 200 మంది గ్రూప్-1 శిక్షణ అధికారులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ హితం కోరుతూ సైకిల్ తొక్కారు.

ఈ కార్యక్రమంలో MCHRD డైరెక్టర్ శాంతికుమారి, GHMC కమిషనర్ కర్ణన్, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్ IAS, MCHRD ఫ్యాకల్టీ DT చారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు మరికల్ మండల ఎంపీడీవో పృథీరాజ్, విక్రం, శివశంకర్ మరియు ఆఫీసర్స్ కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

అమ్మాయిలూ.. జాగ్రత్త!!  పెళ్లి ముసుగులో ప్రమాదం!!

Satyam News

బైక్ పై ముందు ఎస్పి… వెనుక మంత్రి

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

లక్కిరెడ్డిపల్లిలో మహర్షి వాల్మీకి జయంతి

Satyam News

గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు

Satyam News

Leave a Comment