26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైక్లాథాన్‌ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైజింగ్ తెలంగాణ” నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలనే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైక్లాథాన్‌లో దాదాపు 200 మంది గ్రూప్-1 శిక్షణ అధికారులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ హితం కోరుతూ సైకిల్ తొక్కారు.

ఈ కార్యక్రమంలో MCHRD డైరెక్టర్ శాంతికుమారి, GHMC కమిషనర్ కర్ణన్, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్ IAS, MCHRD ఫ్యాకల్టీ DT చారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు మరికల్ మండల ఎంపీడీవో పృథీరాజ్, విక్రం, శివశంకర్ మరియు ఆఫీసర్స్ కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

నేడే సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం

Satyam News

స్కూల్ రిపోర్ట్ కార్డుల పంపిణీలో మీ సేవ రికార్డ్

Satyam News

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Satyam News

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

Satyam News

బీహార్‌ సీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో….!!

Satyam News

హిజ్బుల్లా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

Satyam News

Leave a Comment