హైదరాబాద్హోమ్

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైక్లాథాన్‌ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైజింగ్ తెలంగాణ” నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలనే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైక్లాథాన్‌లో దాదాపు 200 మంది గ్రూప్-1 శిక్షణ అధికారులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ హితం కోరుతూ సైకిల్ తొక్కారు.

ఈ కార్యక్రమంలో MCHRD డైరెక్టర్ శాంతికుమారి, GHMC కమిషనర్ కర్ణన్, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్ IAS, MCHRD ఫ్యాకల్టీ DT చారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు మరికల్ మండల ఎంపీడీవో పృథీరాజ్, విక్రం, శివశంకర్ మరియు ఆఫీసర్స్ కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

తీవ్ర రూపం దాల్చిన బోడుప్పల్ వక్ఫ్ భూముల సమస్య

Satyam News

మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోండి

Satyam News

29 నుంచి అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Satyam News

మోహన్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Satyam News

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : కేంద్ర మంత్రి బండి సంజయ్

Satyam News

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పరిశీలించిన మంత్రి

Satyam News

Leave a Comment