మహబూబ్ నగర్హోమ్

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

#GadwalCourts

గద్వాల జిల్లా కోర్టు సముదాయం జిల్లా కేంద్రంలోనే నిర్మించాలని జిల్లా న్యాయవాదులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రం లోని కోర్టు ప్రాంగణంలో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పుల్లయ్య ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సిగ్గు చేటు అని అన్నారు.

ప్రజలకు అనువైన ప్రాంతం జిల్లా కేంద్రంలోని బిజెపి క్యాంపు కార్యాలయం. అక్కడ నిర్మించకుండా జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో అనంతపురం గుట్టలలో కోర్టు నిర్మిస్తే, వచ్చే కక్షిదారులకు ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది.

అక్కడ ప్రజలు జిల్లా కేంద్రం వచ్చి జిల్లా కేంద్రం నుంచి మళ్లీ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కోర్టు కు వచ్చే కక్షిదారులు గాని సాక్ష్యం చెప్పడానికి వచ్చే వారికీ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది అని అన్నారు.

2024 లో డిసెంబర్లో న్యాయవాదులు నిరసన దీక్ష చేసే సమయంలో అధికార పార్టీ నాయకులు కోర్టు ను గద్వాల జిల్లా కేంద్రంలోని నిర్మించే విధంగా కృషి చేస్తామని చెప్పి నిరసనను విరమించిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఎవరి స్వలాభం కోసం అనంతపురం గుట్టల్లో కోర్టు ను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కచ్చితంగా దీన్ని విరమించుకోవాలి లేని పక్షంలో ప్రజా పోరాటాలు కచ్చితంగా రోడ్ల మీదకు వస్తాయి. ప్రజాలకు వ్యతిరేకంగా పోయేటువంటి ప్రభుత్వం ను, నాయకులను నడిగడ్డ ప్రాంత ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, టిఫిఏఫ్ నాయకులు శంకర ప్రభాకర్, పాలమూరు అధ్యయన వేదిక ఇక్బాల్ బాషా, అబ్దుల్ బాబు సార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

Satyam News

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News

ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే జూరాల, శ్రీశైలం, సాగర్‌ కు నీళ్లు

Satyam News

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News

విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Satyam News

దేశవ్యాప్తంగా 5 వేల వేంకటేశ్వర ఆలయాలు

Satyam News

Leave a Comment