కృష్ణహోమ్

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయాల‌ని నూత‌న క‌మిష‌న్‌కు మ‌హిళా శిశుసంక్షేమ‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సూర్య‌కుమారి సూచించారు. నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాలల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌, స‌భ్యుల‌కు క‌మిష‌న్ కార్యాల‌యంలో మార్గ‌ద‌ర్శ‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం ఉద‌యం ఆమె ప్రారంభించి మాట్లాడారు.

చైర్ ప‌ర్స‌న్ వేటుకూరి ఏవీఎస్ సూర్య‌నారాయ‌ణ‌రాజు, స‌భ్యులు ఉండ‌వ‌ల్లి గాంధీబాబు, ఎం గంగ సూర్య‌నారాయ‌ణ‌, డా. దోని శ్రీనివాస‌మూర్తి, డా. పి నాగ‌మాన‌స‌, కె.జి ప‌ద్మ‌ల‌త‌, చ‌ల్ల మ‌ధుసూద‌న‌రావుల‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. బాల‌ల విద్య‌, ఆరోగ్యం, వికాసం, హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేద్దామ‌ని పిలుపునిచ్చారు.

డేవిడ్ రాజు సీసీవైజె న‌ల్స‌ర్ యూనివ‌ర్సిటీ, ఆంటోని సెబాస్టియ‌న్ క‌ర్ణాట‌క బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ మాజీ చైర్ ప‌ర్స‌న్ ఈ మార్గ‌ద‌ర్శ‌క శిక్ష‌ణ అందించారు. క‌మిష‌న్ విధి విధానాలు, చ‌ట్టాలు, బాధ్య‌త‌లను వివ‌రించారు. ఈ శిక్ష‌ణ ఏర్పాట్ల‌ను ఏపీఎస్సీపీసీఆర్ సెక్ర‌ట‌రీ జి ఉమాదేవి, కార్యాల‌య సిబ్బంది ప‌ర్య‌వేక్షించారు.

Related posts

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి

Satyam News

కడియం శ్రీహరి వ్యవహారశైలిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

Satyam News

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

Satyam News

నందిగామలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహం

Satyam News

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News

Leave a Comment