25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

#crime

చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గా సేవలందిస్తున్న గురవమ్మకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా, రూ. 9 లక్షలు ఫిర్యాదుకి చెల్లించేలా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి మంగళవారం తీర్పు వెలువరించారు.

గురవమ్మ 2019 సెప్టెంబర్ 14 న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి రక్షణ లత వద్ద రూ ఆరు లక్షలు అప్పుగా తీసుకున్నారు . ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా 2021 నవంబర్ 8న రూ. 9 లక్షలకు గురవమ్మ రక్షణ లత కు చెక్కు ఇచ్చారు.

సదరు చెక్కును రక్షణ లత తన బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారు. అది చెల్లలేదు, ఈ మేరకు ఆమె కోర్టులో కేసు దాఖలు చేసుకున్నారు. విచారణలో నేరం రుజువు అవడంతో కోర్టు తీర్పు వెలువబడింది.

Related posts

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News

తెలంగాణ జైళ్ళ శాఖ వినూత్న ఆలోచన..!

Satyam News

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

Satyam News

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

Satyam News

డీలిమిటేషన్ తెలంగాణకు ఒక వరం?

Satyam News

సత్తుపల్లి ఓసి లో భట్టి విక్రమార్క క్షేత్రస్థాయి పరిశీలన

Satyam News

Leave a Comment