Uncategorizedగుంటూరుహోమ్

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

#crime

చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గా సేవలందిస్తున్న గురవమ్మకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా, రూ. 9 లక్షలు ఫిర్యాదుకి చెల్లించేలా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి మంగళవారం తీర్పు వెలువరించారు.

గురవమ్మ 2019 సెప్టెంబర్ 14 న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి రక్షణ లత వద్ద రూ ఆరు లక్షలు అప్పుగా తీసుకున్నారు . ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా 2021 నవంబర్ 8న రూ. 9 లక్షలకు గురవమ్మ రక్షణ లత కు చెక్కు ఇచ్చారు.

సదరు చెక్కును రక్షణ లత తన బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారు. అది చెల్లలేదు, ఈ మేరకు ఆమె కోర్టులో కేసు దాఖలు చేసుకున్నారు. విచారణలో నేరం రుజువు అవడంతో కోర్టు తీర్పు వెలువబడింది.

Related posts

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam News

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News

తుది దశకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

Satyam News

Leave a Comment