గుంటూరుహోమ్

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

#crime

చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గా సేవలందిస్తున్న గురవమ్మకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా, రూ. 9 లక్షలు ఫిర్యాదుకి చెల్లించేలా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి మంగళవారం తీర్పు వెలువరించారు.

గురవమ్మ 2019 సెప్టెంబర్ 14 న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి రక్షణ లత వద్ద రూ ఆరు లక్షలు అప్పుగా తీసుకున్నారు . ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా 2021 నవంబర్ 8న రూ. 9 లక్షలకు గురవమ్మ రక్షణ లత కు చెక్కు ఇచ్చారు.

సదరు చెక్కును రక్షణ లత తన బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారు. అది చెల్లలేదు, ఈ మేరకు ఆమె కోర్టులో కేసు దాఖలు చేసుకున్నారు. విచారణలో నేరం రుజువు అవడంతో కోర్టు తీర్పు వెలువబడింది.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

Satyam News

మంగళగిరి అభివృద్ధి చూసి వైసీపీకి భయం పట్టుకుంది

Satyam News

చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాపై ఏం జరుగుతుంది?

Satyam News

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ‘నకిలీ’ నోట్ల కలకలం

Satyam News

అమరావతికి కేంద్రం వరాలు: సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణం

Satyam News

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News

Leave a Comment