రంగారెడ్డిహోమ్

డీలిమిటేషన్ తెలంగాణకు ఒక వరం?

#TelanganaAssembly

దేశవ్యాప్తంగా జరగనున్న డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణకు గణనీయమైన లాభం కలగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 2011 జనగణన ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఈ సంఖ్య 26కు పెరగనుంది. అదే విధంగా అసెంబ్లీ స్థానాలు 119 నుంచి సుమారు 179 వరకు పెరగవచ్చని అంచనా. కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 182 వరకు చేరే అవకాశమూ ఉందని చెబుతున్నారు. దీంతో రాష్ట్రానికి పార్లమెంట్, అసెంబ్లీ స్థాయిలో ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది.

ఈ మార్పుల్లో అత్యధిక లాభం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు దక్కనుంది. నగర విస్తరణ, జనాభా పెరుగుదల కారణంగా పట్టణ నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగబోతోంది. ప్రస్తుతం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్న హైదరాబాద్ నగరంలో అవి 20కు పెరగనున్నాయి. అలాగే మెడ్చల్–మల్కాజిగిరి ప్రాంతంలో 5 స్థానాలు 13కు, రంగారెడ్డి జిల్లాలో 8 స్థానాలు 13కు పెరిగే అవకాశముంది.

హైదరాబాద్, పాత రంగారెడ్డి జిల్లాను కలిపితే మొత్తం 51 అసెంబ్లీ స్థానాలు ఉండే అవకాశం ఉందని అంచనా. కొత్తగా వచ్చే నియోజకవర్గాల్లో దాదాపు 22 పట్టణ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇది రాష్ట్రంలో ఏర్పడే మొత్తం కొత్త స్థానాల్లో మూడో వంతుకు పైగా ఉండటం గమనార్హం. దీంతో పట్టణ ఓటర్ల ప్రభావం రాజకీయాల్లో మరింత పెరగనుంది.

ఇక మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ అమలు చేసే ప్రతిపాదన కూడా ఈ డిలిమిటేషన్‌తో కలిపి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకారం లోక్‌సభలో సుమారు 9 స్థానాలు, అసెంబ్లీలో దాదాపు 60 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

మొత్తంగా డిలిమిటేషన్ ద్వారా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం పెరగడం, మహిళల ప్రాతినిధ్యం విస్తరించడం, రాష్ట్రానికి కేంద్రంలో ప్రాధాన్యం పెరగడం వంటి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

తిరుమలపై కుట్రలు ఆపవా జగన్…..?

Satyam News

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News

రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

Satyam News

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News

Leave a Comment