తూర్పుగోదావరిహోమ్

ఉపాధి హామీ పథకం లో మొక్కల పెంపకం

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అర్హత కలిగిన రైతులు అందరికీ ఉచితంగా ఉద్యానవన అభివృద్ధిలో భాగంగా మొక్కలు పంపిణి చేస్తుందని రంపచోడవరం డ్వామా ఏపీడి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. క్షేత్రస్థాయి పరిశీనాలో భాగంగా విశ్వనాధ్ మారేడుమిల్లి పంచాయతీ కొత్త కాలనీ రైతుల పొలాలను పరిశీలించి హార్టికల్చర్ అభివృద్ధిలో భాగంగా డ్వామా ద్వారా ఇచ్చిన మొక్కలను పరిశీలించి కొంత మంది రైతులతో మాట్లాడారు.

ఈ సందర్బంగా ఎ పి డి విశ్వనాధ్ మాట్లాడుతూ మారేడుమిల్లి మండలంలో 2025 – 2026 ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 750 ఎకరాలలో దబ్బా, కొబ్బరి, నిమ్మ, జఫ్రా, మామిడి తదితర ఉధ్యావన పంటలు అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నకుమారి, ఏపీఓ దసరా మణి కుమారి, జేఈ బర్ల శ్రీమివాస్, టెక్నికల్ అసిస్టెంట్ రామి రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Final: విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Satyam News

రాయవరం లో అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణా

Satyam News

హోలీ వేడుకలలో విషాదం: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Satyam News

జొన్న‌గుడ్డిలో కార్డ‌న్ సెర్చ్‌: ఆరుగురిపై స‌స్పెక్ట్స్ షీట్స్‌

Satyam News

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

Satyam News

వైసీపీ ఆత్మాహుతి దళం: రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా?

Satyam News

Leave a Comment