భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ న్యాయవాది ముఖ్య అతిథి పి.వెంకట్ రామ కృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రూపొందిన భారత రాజ్యాంగం, వేల ఏళ్లుగా నెలకొని ఉన్న అసమానతలను రూపుమాపి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం పునాదులుగా గొప్ప ఘనతంత్ర భారత ప్రజాస్వామ్యాన్ని అందిస్తుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది డాక్టర్ గంజి ఎజ్రా సీనియర్ అడ్వొకేట్ బి మురళి అడ్వకేట్ పొన్నాడ రాము,సినియర్ అడ్వకేట్ App శ్రీను,అడ్వకేట్ ఫిలిప్ ,అడ్వకేట్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం బార్ కౌన్సిల్ సభ్యులు కలసి స్టేట్ బార్ మెంబర్ పోటీ చేస్తున్నాను నాకు మద్దతుగా ఇవ్వాలి అంటూ సభ్యులను కలిసారు
