జాతీయంహోమ్

పెళ్లైన 38 రోజులకే భర్తను చంపిన భార్య

కర్ణాటకలో వ్యాపారవేత్త సుదీప్, భార్య పోరు పడలేక , ఆమె చేసే అవమానాలు సహించలేక ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారణ అయింది. దీంతో భార్య సౌమ్యను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 తేదీనే వాళ్ళిద్దరికీ పెళ్లైంది. పెళ్ళైన 38 రోజులకే ఆమె పెట్టే హింసలు, చేసే అవమానాలు సహించలేక సుదీప్ విషం తీసుకుని చనిపోయారు.

మార్చి 17 వ తేదీ తల్లితో కలిసి ఒక పూజకు పోతుండగా, స్కూటీ మీద వెనుకే వచ్చిన సౌమ్య, రోడ్డుకు అడ్డంగా స్కూటీ పెట్టి, తల్లితో పూజకు ఎలా పోతావంటూ తిట్టి పోసింది. అందరిలో అవమానిస్తూ మాట్లాడింది. పెళ్ళైన నెల రోజులకే ఇలా జరిగింది. దీంతో మానసికంగా కుంగి పోయి, విషం తీసుకుని చనిపోయాడు. విచారణ జరిపిన పోలీస్, సౌమ్య ఉన్మాదం, అహంకారం, వేదింపులు కారణంగానే సుదీప్ చనిపోయాడని నిర్ధారించి ఆమెపై కేసు పెట్టీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Related posts

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

Satyam News

సాంకేతిక పోలీసింగ్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీ

Satyam News

పాకిస్తాన్ నుంచి వచ్చి…. లవ్ జిహాద్….

Satyam News

స‌మ‌స్య ఎవ‌రు చెప్పినా ప‌రిష్క‌రించ‌డ‌మే ప్ర‌ధానం

Satyam News

రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు చర్యలు ప్రారంభం

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

Satyam News

Leave a Comment