జాతీయంహోమ్

పెళ్లైన 38 రోజులకే భర్తను చంపిన భార్య

కర్ణాటకలో వ్యాపారవేత్త సుదీప్, భార్య పోరు పడలేక , ఆమె చేసే అవమానాలు సహించలేక ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారణ అయింది. దీంతో భార్య సౌమ్యను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 తేదీనే వాళ్ళిద్దరికీ పెళ్లైంది. పెళ్ళైన 38 రోజులకే ఆమె పెట్టే హింసలు, చేసే అవమానాలు సహించలేక సుదీప్ విషం తీసుకుని చనిపోయారు.

మార్చి 17 వ తేదీ తల్లితో కలిసి ఒక పూజకు పోతుండగా, స్కూటీ మీద వెనుకే వచ్చిన సౌమ్య, రోడ్డుకు అడ్డంగా స్కూటీ పెట్టి, తల్లితో పూజకు ఎలా పోతావంటూ తిట్టి పోసింది. అందరిలో అవమానిస్తూ మాట్లాడింది. పెళ్ళైన నెల రోజులకే ఇలా జరిగింది. దీంతో మానసికంగా కుంగి పోయి, విషం తీసుకుని చనిపోయాడు. విచారణ జరిపిన పోలీస్, సౌమ్య ఉన్మాదం, అహంకారం, వేదింపులు కారణంగానే సుదీప్ చనిపోయాడని నిర్ధారించి ఆమెపై కేసు పెట్టీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Related posts

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

Satyam News

శ్రీరంగాపూర్ ఎస్సై బాధ్యత చేపట్టిన హిమబిందు

Satyam News

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

లక్ష్యం సాధించే వరకు దాడులు ఆగవు

Satyam News

Leave a Comment