ప్రత్యేకంహోమ్

పాకిస్తాన్ చొరబాటుదారుడి కాల్చివేత

#Pakistan

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో భారత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు (IB) వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఓ చొరబాటుదారుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది కాల్చి చంపినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి రామ్‌గఢ్ సెక్టార్‌లోని మజ్రా ప్రాంతం వద్ద ఉన్న బోర్డర్ అవుట్‌పోస్ట్ చెక్ పాయింట్ ద్వారా పాకిస్తాన్ పౌరుడు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

చీకటి ఉపయోగించుకొని చొరబడే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతని కదలికలను BSF సిబ్బంది గుర్తించారు. చొరబాటుదారుడిని ఆపేందుకు BSF సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అతడు వాటిని పట్టించుకోకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహం ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోనే ఉందని, సోమవారం ఉదయం వెలుగు వచ్చే వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటనతో సాంబా జిల్లాలో సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

Related posts

అమరావతి కి వచ్చిన ‘బాన్‌బ్లాక్ టెక్నాలజీ’

Satyam News

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

Satyam News

రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి

Satyam News

ముఖ్యమంత్రికి సన్మానం చేసిన వనపర్తి ఎమ్మెల్యే

Satyam News

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News

Leave a Comment