ముఖ్యంశాలుహోమ్

తెలంగాణలో పోటీకి జనసేన పార్టీ సిద్ధం

#PavanKalyan

తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ అంతర్భాగమని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్ వివరించారు.

తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదన్నారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు.

తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని.. అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్‌ కబ్జా అని తేలిస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు గద్దర్‌ తెలుసునన్నారు.

గద్దర్‌ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీల నేతలను పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. గద్దర్‌ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని గుర్తు చేశారు. గద్దర్‌ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అంటూ తనను ప్రశ్నిస్తున్న నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలంటించారు.

Related posts

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒమన్ మధ్య కీలక ఒప్పందం

Satyam News

అన్ని ర్యాంకుల పోలీసులకు శిక్షణ తప్పని సరి

Satyam News

అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ

Satyam News

అమ్మ ఒడి vs తల్లికి వందనం.. ఏ స్కీమ్‌తో ఎక్కువ లాభం?

Satyam News

రూ.38 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

Satyam News

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

Satyam News

Leave a Comment