38.2 C
Hyderabad
April 29, 2024 13: 16 PM
Slider నెల్లూరు

వి ఎస్ యు లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

#simhapuri

విక్రమ సింహపురి  విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో, నయాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సౌజన్యం తో  9వ  అంతర్జాతీయ  యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగ మరియు ఆయుర్వేదం అనే రెండు ముఖ్యమైన అంశాలు మన దేశ సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యమైనవి అని అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగ ను దైనందిన జీవితంలో ఒక భాగం గా అలవాటు చేసుకున్నారని అన్నారు.

ప్రస్తుతం నెల కొని వున్నా పరిస్థితులలో మన సంప్రదాయ పద్ధతులు అయిన యోగ అలాగే ఆయుర్వేదమును అందరు ఆచరించాలని  కోరారు. మినిస్ట్రీ అఫ్ ఆయుష్ వారు యోగ మరియు ఆయుర్వేదమును శాస్త్రీయ పద్ధతిలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయటానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయం యోగ మీద ఒక ప్రత్యేకమైన 3 నెలల సర్టిఫిఫికేట్ కోర్స్ ను ప్రారంభించిన రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్ర రెడ్డి అన్నారు.

తదనంతరం స్థానిక సర్టిఫైడ్ యోగ ప్రాక్టీషనర్ జి నరేష్ కుమార్  అంతర్జాతీయ యోగా దిన ప్రోటోకాల్ లో వున్న వివిధ రకాల యోగాసనాలు  చేసి చూపించారు. యోగ యొక్క ప్రాముఖ్యతను అర్థవంతంగా అందరికి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ ఆచార్య జి విజయ్ ఆనంద కుమార్ బాబు, ఎన్ ఎస్ ఎస్   సమన్వయ కర్త  డా. ఉదయ్ శంకర్ అల్లం, పి ఆర్ ఓ డా కోట నీల మణికంఠ, బోధన,బోధ నేతల సిబ్బంది మరియు ఎన్ ఎస్ ఎస్   వాలంటీర్లు పాల్గొన్నారు. నయాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డైరెక్టర్ సాయి విగ్నేష్ పాల్గొన్నారు.

Related posts

ఏపిలో ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే

Satyam NEWS

మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ ఉద్యోగి

Satyam NEWS

మట్టి మాఫియా పై అధికారుల పరిశీలన

Satyam NEWS

Leave a Comment